News September 21, 2024
రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News September 21, 2024
తిరుపతి లడ్డూ వివాదం ఫేక్ కావొచ్చు: TMC ఎంపీ
తిరుపతి లడ్డూ వివాదం బీజేపీ వ్యాప్తి చేసిన కల్పితం కావొచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే అనుమానాలు వ్యక్తం చేశారు. ‘బీజేపీ ఎగ్జిట్ పోల్స్ టైమ్లో స్టాక్ మార్కెట్ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. దాంతో హెరిటేజ్ షేర్లపై CBN కుటుంబానికి రూ.1200 కోట్ల లాభం వచ్చింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిపై ఆరోపణలు చేసిన సీఎంకు ఓ డెయిరీ రాజ్యం ఉండటం కాకతాళీయమేనా?’ అని సందేహం వ్యక్తం చేశారు.
News September 21, 2024
లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం
AP: లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా టీటీడీ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులు, రుత్విక్కులను కూడా తిరుమలకు రప్పిస్తున్నారు. ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.
News September 21, 2024
3,445 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
RRB అండర్ గ్రాడ్యుయేట్ కింద 3445(టికెట్ క్లర్క్-2022, టైపిస్ట్-361, జూనియర్ టైపిస్ట్-990, ట్రైన్ క్లర్క్-72) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. SCRలో 89, ECoR 56 పోస్టులున్నాయి. 18-33 ఏళ్లలోపు ఇంటర్ అర్హత ఉన్న వారు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.500(CBT పరీక్షకు హాజరైతే రూ.400 రిటర్న్ ఇస్తారు). పూర్తి వివరాలకు ఇక్కడ <