News September 21, 2024
జగన్కు శ్రీవారి పాపం తగులుతుంది: మంత్రి సవిత
AP: తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్కు వేంకటేశ్వరస్వామి పాపం తగులుతుందని మంత్రి సవిత అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆమె స్పందించారు. ‘లడ్డూ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందుకు బాధ్యులైన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొవ్వు పట్టిన వ్యక్తులే లడ్డూలో జంతువుల కొవ్వు కలిపి తయారు చేయించారు’ అని ఆమె మండిపడ్డారు.
Similar News
News September 21, 2024
పెళ్లి చేసుకోమని ఆమె వేధించింది: జానీ మాస్టర్ భార్య
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోండని ఆమె జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచి, బయట పెళ్లి చేసుకోమనేది. మతం మార్చుకుంటానని కూడా చెప్పేది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసేది. ఆమె వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News September 21, 2024
జనవరిలో బీచ్ ఫెస్టివల్: దుర్గేశ్
AP: YCP ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కాకినాడలో NTR బీచ్ను ఆయన పరిశీలించారు. ‘YCP ప్రభుత్వం నిలిపివేసిన బీచ్ ఫెస్టివల్ను పునరుద్ధరిస్తాం. జనవరిలో నిర్వహిస్తాం. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి చేస్తాం’ అని దుర్గేశ్ వెల్లడించారు.
News September 21, 2024
బోయపాటి-బాలకృష్ణ మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ ద్వయం నుంచి వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ కాంబోలో మరో చిత్రం రానుండగా దసరాకు షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా తమన్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తోంది. సూపర్ హిట్ అఖండ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కనుందని టాక్. దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.