News September 21, 2024

3,445 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

RRB అండర్ గ్రాడ్యుయేట్ కింద 3445(టికెట్ క్లర్క్-2022, టైపిస్ట్-361, జూనియర్ టైపిస్ట్-990, ట్రైన్ క్లర్క్-72) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. SCRలో 89, ECoR 56 పోస్టులున్నాయి. 18-33 ఏళ్లలోపు ఇంటర్ అర్హత ఉన్న వారు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.500(CBT పరీక్షకు హాజరైతే రూ.400 రిటర్న్ ఇస్తారు). పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News September 21, 2024

తిరుమల లడ్డూ వ్యవహారం.. షాకయ్యా: టాలీవుడ్ హీరో

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వ్యవహారంపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించారు. ‘గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరిగిందని తెలిసి షాకయ్యా. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం. ఈ పని చేసిన వారిని శిక్షించాలి. దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి’ అని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అమిత్‌షాలను ఆయన ట్యాగ్ చేశారు.

News September 21, 2024

ఇది క్షమించరాని నేరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

TG: తిరుమల లడ్డూ ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే కాకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.

News September 21, 2024

చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి: అంబటి రాంబాబు

image

AP: ప్రాయశ్చిత్త <<14161291>>దీక్ష<<>> చేయాల్సింది పవన్ కళ్యాణ్ కాదని చంద్రబాబు చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకొని భక్తుల మనోభావాలను సీఎం దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన బాబు దీక్ష చేయాలని రాంబాబు ట్వీట్ చేశారు.