News September 21, 2024
బాబు, లోకేశ్ ప్రమాణానికి సిద్ధమా?: అంబటి
AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నిరూపించలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ వ్యవహారంపై తిరుమలలో చంద్రబాబు, లోకేశ్కు ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని ఉపయోగించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపాం. కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చింది’ అని అంబటి ఆరోపించారు.
Similar News
News September 21, 2024
NTR ‘దేవర’ సినిమాకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
AP: రాజకీయాలకు అతీతంగా తెలుగు చిత్ర సీమకు మంచి జరగాలని చంద్రబాబు కూటమి నాయకత్వం కోరుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దేవర సినిమాకు టికెట్ల పెంపుపై ఆయన స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ నిర్మాతలు, నటులు పడిన కష్టాలు తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. తామెప్పుడూ సినీ పరిశ్రమను వైసీపీ నేతల్లా ఇబ్బందులకు గురిచేయబోమని పేర్కొన్నారు. దేవర విడుదలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
News September 21, 2024
మాధబి సమాచారం ఇచ్చేందుకు సెబీ నిరాకరణ
తమ ఛైర్మన్ మాధబికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడానికి సెబీ నిరాకరించింది. ఆస్తులు, ఈక్విటీలపై మాధబీ సమర్పించిన డిక్లరేషన్లను బహిర్గతం చేయడం ఆమె వ్యక్తిగత భద్రతను ప్రమాదంలో పడేసినట్టే అవుతుందని RTI దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణంగా ఆమె తప్పుకున్న కేసుల వివరాలు అందుబాటులో లేవని, వాటిని క్రోడీకరించడానికి అధిక సమయం పడుతుందని తెలిపింది.
News September 21, 2024
కుక్కలకు పాండాలుగా రంగులు.. చైనాలో సందర్శకుల ఆగ్రహం
పాండాలను చూసేందుకు వచ్చే సందర్శకులను చైనాలో కొన్ని జూలు మోసం చేస్తున్నాయి. తాజాగా షాన్వీ జూలో కుక్కలకు పాండాల్లా రంగులు వేస్తున్నారని ఆరోపిస్తూ ఓ సందర్శకుడు వీడియో తీసి నెట్లో పెట్టారు. తొలుత అవి పాండా డాగ్స్ అనే జాతి అంటూ బుకాయించిన జూ నిర్వాహకులు, తర్వాత ఆరోపణలు నిజమని ఒప్పుకొన్నారు. దీంతో సందర్శకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ డబ్బులు వెనక్కివ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.