News September 21, 2024
శ్రీలంకలో ముగిసిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2022 ఆర్థిక సంక్షోభం తరువాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసే సమయానికి 70% ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘె, విపక్ష నేత సంజిత్ ప్రేమదాస, అనూర దిస్సనాయకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ పూర్తైన వెంటనే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిందే.
Similar News
News September 22, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: సెప్టెంబర్ 22, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:09 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:30 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:12 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 22, 2024
జోబైడెన్తో ప్రధాని మోదీ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్తో సమావేశమయ్యారు. డెలావేర్లోని బైడెన్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించారు.
News September 22, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.