News September 21, 2024
26న జనసేనలోకి ముగ్గురు YCP మాజీ MLAలు
AP: ఈ నెల 26న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య తమ పార్టీలో చేరుతున్నట్లు జనసేన ప్రకటించింది. వీరితోపాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్, రత్నభారతి కూడా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ట్వీట్ చేసింది.
Similar News
News September 22, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: సెప్టెంబర్ 22, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:09 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:30 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:12 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 22, 2024
జోబైడెన్తో ప్రధాని మోదీ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్తో సమావేశమయ్యారు. డెలావేర్లోని బైడెన్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించారు.
News September 22, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.