News September 21, 2024

గవర్నర్‌ను కలిసిన వైఎస్ షర్మిల

image

AP: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె గవర్నర్‌ను కోరారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లడ్డూ కల్తీ బాధ్యులు ఎవరో తేల్చాలని కోరారు.

Similar News

News September 22, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: ఈ నెల 25న వరద బాధితులకు సాయం: CBN
* రేపటి నుంచి DY.CM పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష
* జగన్.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా?: హోం మంత్రి అనిత
* బాబు, లోకేశ్ ప్రమాణానికి సిద్ధమా?: అంబటి రాంబాబు
* TG: ITIల సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలి: CM రేవంత్
* గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ: మంత్రి పొంగులేటి
* అమృత్ పథకంలో రేవంత్ ఫ్యామిలీ అవినీతి: కేటీఆర్
* ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణ స్వీకారం

News September 22, 2024

ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్

image

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 202 రన్స్‌కే ఆలౌటైంది. ఆ జట్టులో స్మిత్ (49) టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, హేజిల్‌వుడ్, హార్డీ, మ్యాక్స్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఐదు వన్డేల సిరిస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంతో నిలిచింది. తొలి వన్డేలోనూ ఆ జట్టు గెలిచింది.

News September 22, 2024

అభిమానులకు ‘దేవర’ గుడ్‌న్యూస్

image

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దేవర మూవీ యూనిట్ శుభవార్త చెప్పింది. రేపు(సెప్టెంబర్ 22వ తేదీ) ఉదయం 11.07 గంటలకు దేవర సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కళ్లల్లో ఆవేశం, అతని వెనుక మారణహోమంతో దేవర వస్తున్నాడంటూ ట్రైలర్‌పై అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌తో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.