News September 21, 2024

నగరవాసులకు GHMC కమిషనర్ కీలక విజ్ఞప్తి

image

నగరవాసులకు GHMC కీలక విజ్ఞప్తి చేసింది. ‘నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇంట్లోనే ఉండండి. అనవసర ప్రయాణాన్ని మానుకోండి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నూతన నిర్మాణాలు, శిథిలావస్థ భవనాలకు దూరంగా ఉండండి. వరదల్లో రోడ్డు దాటే సాహసం చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో 040 21111111నంబర్‌ను సంప్రదించండి. అహోరాత్రులు సేవలు అందించేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం’ అని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.

Similar News

News November 3, 2025

VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యువు ఒడికి

image

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.

News November 3, 2025

HYD: మృతులకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి

image

చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ప్రకటిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే CM రేవంత్ రెడ్డి స్పందించి మంత్రులు, అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.

News November 3, 2025

మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

image

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.