News September 21, 2024

సీఎంతో వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ బృందం సమావేశమైంది. మౌలిక వసతులు అభివృద్ధి, విద్య, వైద్యం, సాగు నీటి రంగాల్లో ప్రాజెక్టులను అత్యుత్తమ ప్రమాణాలతో నిలిపేలా ఆర్థిక సహకారం అందించాలని వారిని కోరారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను బృందం కొనియాడింది. ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

Similar News

News November 6, 2025

కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

image

కోయంబత్తూరు <<18187183>>గ్యాంగ్ రేప్<<>> బాధితురాలిపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 11.30గం.కు మహిళ, పురుషుడు చీకట్లో ఉండటం వల్ల కలిగే అనర్థాలను ఆపేదెలాగని అన్నారు. వీటిని పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని చెప్పారు. పేరెంట్స్ పెంపకం, టీచర్లతోనే మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీంతో నిందితులను ఒక్కమాట అనకుండా బాధితురాలిని తప్పుబట్టడమేంటని BJP నేత అన్నామలై మండిపడ్డారు.

News November 6, 2025

పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

image

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.

News November 6, 2025

ఏకగ్రీవ ఎన్నిక ఓటుస్వేచ్ఛను దెబ్బతీయడం కాదు: కేంద్రం, ఈసీ

image

ఓటు స్వేచ్ఛ ఓటు హక్కుకు భిన్నమైనదని కేంద్రం, ECలు సుప్రీంకోర్టుకు నివేదించాయి. ఒక్క అభ్యర్థే ఉన్నప్పుడు ఏకగ్రీవ ఫలితం ప్రకటించడమంటే ‘నోటా’ అవకాశాన్ని కాదనడమేనన్న పిటిషన్‌పై అవి సమాధానమిచ్చాయి. ‘ఓటుహక్కు చట్టబద్ధం. ఓటుస్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. పోలింగ్ జరిగినప్పుడే ఓటు స్వేచ్ఛ వర్తిస్తుంది’ అని పేర్కొన్నాయి. పోలింగే లేనప్పుడు రాజ్యాంగహక్కును దెబ్బతీసినట్లు కాదని తెలిపాయి. దీనిపై SC విచారణ చేపట్టింది.