News September 22, 2024
దిల్లీ ఫుడ్ ఇండియా ప్రదర్శనలో ఏలూరు ఆహార ఉత్పత్తులు

వరల్డ్ ఫుడ్ ఇండియా పేరిట దిల్లీలో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఏలూరు జిల్లా ఆహార ఉత్పత్తులు ప్రదర్శించబడటం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 జిల్లాల నుంచి ఉత్పత్తులు ఎంపిక కాగా.. కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన మథర్ థెరీసా మహిళా స్వయం సహాయక సంఘ అధ్యక్షురాలు కృపామణి తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శనకు ఎంపికకావడం అభినందనీయమన్నారు.
Similar News
News July 6, 2025
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి 1.30 వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 6, 2025
పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగలా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో “మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్” పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులకు ఆహ్వానం అందించాలని సూచించారు. ప్రతి స్కూల్లోనూ తల్లులకు పాదపూజ చేయించాలని తెలిపారు.
News July 6, 2025
ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్: కలెక్టర్

ఈనెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పీటీఎం సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.