News September 22, 2024
దిల్లీ ఫుడ్ ఇండియా ప్రదర్శనలో ఏలూరు ఆహార ఉత్పత్తులు

వరల్డ్ ఫుడ్ ఇండియా పేరిట దిల్లీలో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఏలూరు జిల్లా ఆహార ఉత్పత్తులు ప్రదర్శించబడటం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 జిల్లాల నుంచి ఉత్పత్తులు ఎంపిక కాగా.. కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన మథర్ థెరీసా మహిళా స్వయం సహాయక సంఘ అధ్యక్షురాలు కృపామణి తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శనకు ఎంపికకావడం అభినందనీయమన్నారు.
Similar News
News March 2, 2026
యథావిధిగా జిల్లాలో పీజీఆర్ఎస్: కలెక్టర్ నాగరాణి

భీమవరంలోని కలెక్టరేట్తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టరు నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.
News March 1, 2026
గొల్లలకోడేరు కాదు.. వన్టౌన్ స్టేషన్కు రండి: SP

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలు, ఫిర్యాదులతో నేరుగా వన్టౌన్ స్టేషన్కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.
News March 1, 2026
ప.గో: డబ్బులు కొట్టేసేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఇది..!

సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. బురిడీ కొట్టించే ప్రయత్నంలో బెడిసి కొట్టిన ఉదంతం ఆకివీడు మండలంలో వెలుగు చూసింది. అజ్జమూరుకి చెందిన రిటైర్డ్ టీచర్కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్కి సంబంధించి పత్రాలపై ష్యూరిటీ పెట్టిన సంగతి గుర్తులేదా అంటూ అతడ్ని భయపెట్టారు. ఆయన ధైర్యంగా ఎదుర్కొనే సరికి తోక ముడిచాడు. మళ్ళీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.


