News September 22, 2024

కర్నూలు: అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

image

కేంద్ర ప్రభుత్వ పథకాలను కర్నూలు జిల్లా అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.

Similar News

News October 7, 2025

కర్నూలులో ఆటో నడిపిన మంత్రి టీజీ భరత్

image

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతోందని మంత్రి TG భరత్ అన్నారు. కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు రూ.15 వేలు ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేసేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు. అనంతరం ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు.

News October 7, 2025

వాల్మీకి భవన్ నిర్మాణం కోసం రూ.కోటి ఇస్తా: మంత్రి టీజీ

image

వాల్మీకి భవన్ నిర్మాణం కోసం తన తరుఫున రూ.కోటి సహకారం అందిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూల్లో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఈ విరాళం ప్రకటించారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ తమ నాయకుడు సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి టీజీ భరత్ చెప్పారు.

News October 6, 2025

మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక మృతి

image

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఐదేళ్ల బాలిక లలిత సోమవారం మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మట్టి గడ్డలను తొలగించి వారిని రక్షించారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.