News September 22, 2024
ప్యూరిఫైడ్ వాటర్తో మెగ్నీషియం లోపం?

మెగ్నీషియం మన నరాల వ్యవస్థ పనితీరుకు, డయాబెటిస్, ఇస్కీమిక్ స్ట్రోక్ నివారణకు అత్యవసరం. ప్రకృతిసిద్ధంగా లభించే నీటిలో 10-20 శాతం మేర మెగ్నీషియం ఉంటుంది. కానీ నేడు వాడుతున్న ప్యూరిఫైడ్ లేదా మినరల్ వాటర్లో అన్ని మినరల్స్ను తొలగిస్తున్నారని ఇజ్రాయెల్ పరిశోధకులు తెలిపారు. దీంతో నీటి ద్వారా లభించాల్సిన మెగ్నీషియం మనకు అందడం లేదని, మినరల్ వాటర్ మృతజలాలతో సమానమని తాజా నివేదికలో హెచ్చరించారు.
Similar News
News January 17, 2026
మెగ్నీషియంతో జుట్టుకు మేలు

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్, చిక్కుళ్లు, అరటి, జామకివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News January 17, 2026
మళ్లీ సంక్రాంతికి వస్తాం!

భోగి నాడు మంటల వెలుగుల్లో బంధువులతో పంచుకున్న వెచ్చని మమతలు, సంక్రాంతి రోజు ఆరగించిన పిండి వంటల రుచులు, కనుమకు చేసిన సందడి జ్ఞాపకాలను మోసుకుంటూ జనం మళ్లీ పట్నం బాట పడుతున్నారు. సెలవులు ముగియడంతో చదువులు, వృత్తి, వ్యాపారం రీత్యా పట్టణాల్లో స్థిరపడిన వారు బిజీ జీవితంలోకి వచ్చేస్తున్నారు. అమ్మానాన్నలకు జాగ్రత్తలు చెప్పి, బంధువులు, స్నేహితులకు మళ్లొస్తామని హామీ ఇచ్చి సొంతూళ్లకు టాటా చెబుతున్నారు.
News January 17, 2026
323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<


