News September 22, 2024

NPS వాత్సల్య స్కీమ్‌: నెలకు ₹833తో ₹11 కోట్లు

image

NPS వాత్సల్య స్కీమ్‌తో పిల్లలకు 60 ఏళ్లు వచ్చేసరికి రూ.11.05 కోట్లు చేతికొస్తాయని అంచనా. Ex. నెలకు ₹833/ఏటా ₹10వేలు 18ఏళ్లు జమచేస్తే పెట్టుబడి ₹1.8 లక్షలవుతుంది. దీనిపై 10% రిటర్న్ వస్తే ₹5లక్షలు అందుతాయి. అదే 60 ఏళ్లకైతే పెట్టుబడి మొత్తం ₹6 లక్షలు అవుతుంది. దీనిపై రిటర్న్ 10% అయితే ₹2.75 కోట్లు, 11.59%తో ₹5.97 కోట్లు, 12.86%తో ₹11.05 కోట్లు అందుతాయి. జమ చేసే డబ్బును షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు.

Similar News

News February 9, 2026

US సైనిక మోహరింపులకు భయపడం: ఇరాన్

image

అమెరికాతో <<19053726>>చర్చల్లో<<>> యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. <<19009250>>సైనిక మోహరింపు<<>>లతో అమెరికా తమను భయపెట్టలేదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ అన్నారు. ‘మాకు USపై పెద్దగా నమ్మకం లేదు. ఆ దేశంతో చర్చల గురించి మా వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.

News February 9, 2026

గొర్రెలను కొంటున్నారా? మంద వేగంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

image

గొర్రెల పెంపకంలో ఆదాయం మంద అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. దీని కోసం రైతులు మంద నుంచే గొర్రెలను కొనాలి. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునేవి వద్దు. చూడి, మొదటిసారి ఈనిన వాటిని కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తన పొట్టేలు రెండేళ్ల లోపు వయసుండి, ఆరోగ్యంగా, చురుకుగా, కవల పిల్లలను కనే వంశం నుంచి వచ్చినదై ఉండాలి. గొర్రెల మంద పెరగడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.

News February 9, 2026

పట్టణాల్లో జీ ప్లస్ 3, 5 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు!

image

TG: పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ 3, 5 టవర్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కో టవర్‌లో 12 ఇళ్లు ఉండేలా నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి 19 స్థలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి నిర్మాణాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు హౌసింగ్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.