News September 22, 2024
హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు చేపట్టిన క్షిపణి దాడుల్లో 38 మంది మృతి చెందారు. ఇందులో హెజ్బొల్లా నెం.2 ఇబ్రహీం అకీల్ ఉన్నారు. మొత్తంగా సంస్థకు చెందిన 16 మంది కీలక కమాండర్లను హతమార్చింది. సంస్థ చీఫ్ నస్రల్లాతో పాటు మరో ఇద్దరు కీలక కమాండర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. తమ పౌరులకు హాని కలిగించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది.
Similar News
News September 22, 2024
చరిత్ర సృష్టించిన భారత్
చెస్ ఒలింపియాడ్-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. ఓపెన్ సెక్షన్లో భారత్ మరో రౌండ్ మిగిలుండగానే 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ప్లేయర్ ఫాబియానో కరువానను దొమ్మరాజు గుకేశ్ ఓడించారు. ఈయన నవంబర్లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్లో తలపడనున్నారు. కాగా 2020లో రష్యాతో కలిసి భారత్ సంయుక్త విజేతగా నిలిచింది.
News September 22, 2024
ఏఆర్ డెయిరీలో కేంద్రం తనిఖీలు
AP: తిరుమలకు గతంలో ఆవు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో కేంద్ర ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడులోని దిండుగల్ ప్లాంటులో సుమారు రెండు గంటల పాటు తనిఖీలు చేసి నెయ్యి, వెన్న, పెరుగు శాంపిల్స్ సేకరించారు. కాగా ఈ సంస్థ తిరుమలకు పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, బ్లాక్ లిస్టులో పెట్టామని టీటీడీ ఈవో చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
News September 22, 2024
నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ
AP: టీటీడీ అధికారులు ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది.