News September 22, 2024
ముంపు నష్టం నమోదుకు నేడు, రేపు అవకాశం
AP: విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 2,740 మంది ఖాతాదారుల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రూ.148.22 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేశామని, కొత్తగా రూ.9.62 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ముంపు నష్ట పరిహారం నమోదుకు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నేడు, రేపు సచివాలయాలను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని తెలిపారు. సోమవారం తుది జాబితా ప్రకటిస్తామన్నారు.
Similar News
News September 22, 2024
కొరటాల శివ-ప్రభాస్ కాంబోలో మరో సినిమా?
ప్రభాస్ కోసం దర్శకుడు కొరటాల శివ ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘దేవర’ పార్ట్-2 తర్వాత వీరి కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం. గతంలో కొరటాల డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సూపర్ హిట్గా నిలిచింది. ఆయన డైరెక్ట్ చేసిన ‘దేవర’ పార్ట్-1 ఈనెల 27న రిలీజ్ కానుంది. ఇది హిట్ అయితేనే కొరటాలకు నెక్స్ట్ బిగ్ స్టార్స్తో అవకాశాలు దక్కుతాయని పలువురు నెటిజన్లు అంటున్నారు.
News September 22, 2024
విచారణ జరగాలి.. దోషులను శిక్షించాలి: పవన్
AP: తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా NDA ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని Dy.CM పవన్ హామీ ఇచ్చారు. ‘దీనిపై CBIతో విచారణ జరిపించడంపై క్యాబినెట్లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి’ అని అన్నారు.
News September 22, 2024
ఖడ్గమృగాల దినోత్సవం.. మోదీ స్పెషల్ ట్వీట్
ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. ‘అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటైన ఖడ్గమృగాలను రక్షించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ఏళ్లుగా ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు. దేశంలో అత్యధికంగా ఖడ్గమృగాలు కలిగి ఉండటం గర్వించదగ్గ విషయం. వీటిని చూసేందుకు కజిరంగా ఫారెస్ట్ను అంతా సందర్శించండి’ అని తెలిపారు.