News September 22, 2024
తిరుమల నెయ్యి ట్యాంకర్లకు GPS, ఎలక్ట్రిక్ లాకింగ్
AP: తిరుమలకు పంపే ‘నందిని’ ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్ను ఓపెన్ చేయలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. టీటీడీకి నెల రోజుల క్రితం నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని వివరించారు.
Similar News
News September 22, 2024
విచారణ జరగాలి.. దోషులను శిక్షించాలి: పవన్
AP: తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా NDA ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని Dy.CM పవన్ హామీ ఇచ్చారు. ‘దీనిపై CBIతో విచారణ జరిపించడంపై క్యాబినెట్లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి’ అని అన్నారు.
News September 22, 2024
ఖడ్గమృగాల దినోత్సవం.. మోదీ స్పెషల్ ట్వీట్
ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. ‘అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటైన ఖడ్గమృగాలను రక్షించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ఏళ్లుగా ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు. దేశంలో అత్యధికంగా ఖడ్గమృగాలు కలిగి ఉండటం గర్వించదగ్గ విషయం. వీటిని చూసేందుకు కజిరంగా ఫారెస్ట్ను అంతా సందర్శించండి’ అని తెలిపారు.
News September 22, 2024
చర్చిలో అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా?: పవన్
తిరుమలలో జరిగినట్లు చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే దేశమంతా అల్లకల్లోలం చేసేవారని, ప్రపంచమంతా తెలిసేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘మేము అన్ని మతాలను గౌరవిస్తాం. కానీ ఈ వివాదంపై మాట్లాడొద్దంటే ఎలా? దీని వల్ల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే చర్చి/మసీదులో జరిగితే మాజీ సీఎం జగన్ ఊరుకుంటారా? దోషులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ‘ అని ఫైరయ్యారు.