News September 22, 2024

చరిత్ర సృష్టించిన భారత్

image

చెస్ ఒలింపియాడ్‌-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. ఓపెన్ సెక్షన్‌లో భారత్‌ మరో రౌండ్‌ మిగిలుండగానే 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ప్లేయర్‌ ఫాబియానో కరువానను దొమ్మరాజు గుకేశ్‌ ఓడించారు. ఈయన నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. కాగా 2020లో రష్యాతో కలిసి భారత్ సంయుక్త విజేతగా నిలిచింది.

Similar News

News September 22, 2024

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: హీరో

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరం. ఇది లోపం కాదు. విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానపరిచారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.

News September 22, 2024

చంద్రబాబు పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం: VSR

image

AP: తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేయడంలో చంద్రబాబు ఆద్యుడు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘100 రోజుల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రూ.40వేల కోట్ల అప్పులు చేశారు. నేరాలు దారుణంగా పెరిగిపోయాయి. మిగతా 1725 రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు, రాష్ట్ర విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం’ అని ట్వీట్ చేశారు.

News September 22, 2024

ట్రాఫిక్‌లో చిక్కుకున్న CM.. ఇద్దరు అధికారులు సస్పెండ్!

image

UP CM యోగి Sept 10న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అప్పటికే కురిసిన వర్షం వల్ల రోడ్లను వరదలు ముంచెత్తడంతో ట్రాఫిక్ జామైంది. అప్పుడే ఇండియా ఎక్స్‌పో మార్ట్‌ నుంచి తిరిగి గౌతమ్‌బుద్ధ వర్సిటీకి వెళుతున్న CM యోగి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్‌కు ట్రాఫిక్ కారణం కాదని చెప్పడం గమనార్హం.