News September 22, 2024
స్మృతి ఇరానీకి ఢిల్లీ BJP పగ్గాలు?
వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP వ్యూహాలకు పదునుపెడుతోంది. AAP కన్వీనర్ కేజ్రీవాల్ CM పదవి నుంచి తప్పుకొని ఆతిశీకి బాధ్యతలు అప్పగించగా BJP తమ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీని తెరపైకి తెచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సభ్యత్వ నమోదును ఆమె చూసుకుంటున్నారు. ఆమెనే CM అభ్యర్థనే ప్రచారం కూడా ఉంది. సౌత్ ఢిల్లీలో ఇల్లు కొనడం చూస్తే స్మృతి ఢిల్లీలో పాగా వేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
Similar News
News September 22, 2024
భారీ వర్షాలతో తాజ్ మహల్కు పగుళ్లు
భారీ వర్షాలతో తాజ్ మహల్ గోడలపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర భాగాలూ దెబ్బతిన్నాయి. ప్రధాన గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్లో ఖురాన్లోని సూరాలను చెక్కారు. ఈ ఆక్షరాలు చెదిరిపోయినట్టు TGFI తెలిపింది. తాజ్ మహల్లో ఎలాంటి సమస్యలూ లేవంటున్న ASI ఇటీవల ఏం సర్వే చేసిందని ప్రశ్నించింది. ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్పై ప్రతికూల ప్రచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని పేర్కొంది.
News September 22, 2024
GET READY: 2.07కి ‘దేవర’ రిలీజ్ ట్రైలర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ‘దేవర’ ట్రైలర్ రిలీజ్పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఉదయం 11.05కు రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ను మధ్యాహ్నం 2.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేవర మాస్ను చూసేందుకు అంతే ఆత్రుతగా మరికొద్దిసేపు వేచి ఉండాలని పేర్కొన్నారు. ‘దేవర’ రిలీజ్ ట్రైలర్ గురించి మీరూ ఎదురుచూస్తున్నారా? కామెంట్ చేయండి.
News September 22, 2024
ఒవైసీలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి
TG: ఎంఐఎం పార్టీ నేతలు, ఒవైసీ సోదరులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. కరీంనగర్లో పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రం విచారణ చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.