News September 22, 2024

73 మంది డిప్యూటీ తహశీల్దార్ల బదిలీ

image

అనంతపురం జిల్లాలో 73 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారిని బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ పొంది సంబంధిత కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 18, 2026

నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

image

అనంతపురం జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఆరు మున్సిపాలిటీలలో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. అనంతపురం నగరపాలక సంస్థకు కలెక్టర్ ఆనంద్, తాడిపత్రికి జేసీ విష్ణు చరణ్, గుత్తికి ఆర్డీవో కేశవ నాయుడు, కళ్యాణదుర్గంకు వసంతబాబు, రాయదుర్గంకు రామకృష్ణారెడ్డి, గుంతకల్‌కు శ్రీనివాసులు పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. పౌర సేవలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వీరు చేపట్టనున్నారు.

News March 18, 2026

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

image

అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై చర్చించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు.

News March 18, 2026

అనంతపురం పీఎల్పీ ఆవిష్కరణ

image

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యత రంగాల వార్షిక రుణ ప్రణాళిక (PLP)ను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. మొత్తం రుణ సామర్థ్యాన్ని రూ.19,93,436.31 లక్షలుగా నిర్ణయించారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గృహ నిర్మాణం, పునరుత్పాదక శక్తి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రణాళికతో జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, రైతుల ఆదాయ వృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.