News September 22, 2024
కొరటాల శివ-ప్రభాస్ కాంబోలో మరో సినిమా?
ప్రభాస్ కోసం దర్శకుడు కొరటాల శివ ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘దేవర’ పార్ట్-2 తర్వాత వీరి కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం. గతంలో కొరటాల డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సూపర్ హిట్గా నిలిచింది. ఆయన డైరెక్ట్ చేసిన ‘దేవర’ పార్ట్-1 ఈనెల 27న రిలీజ్ కానుంది. ఇది హిట్ అయితేనే కొరటాలకు నెక్స్ట్ బిగ్ స్టార్స్తో అవకాశాలు దక్కుతాయని పలువురు నెటిజన్లు అంటున్నారు.
Similar News
News September 22, 2024
అశ్విన్ ‘ది ఆల్ రౌండర్’
భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు క్రికెట్లో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్తో ముగిసిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ(113)తో అదరగొట్టి, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశారు. ఒకే మ్యాచ్లో సెంచరీ, 5వికెట్లు తీయడం అశ్విన్కిది 4వసారి. ఇయాన్ బోథమ్(5) టాప్లో ఉన్నారు. ఒకే వేదికపై(చెన్నై) ఈ ఫీట్ 2సార్లు(2021, 2024) నమోదు చేసిన ఆటగాడు మాత్రం అశ్విన్ ఒక్కరే.
News September 22, 2024
ఇండియా-బీపై ఇండియా-డీ ఘన విజయం
దులీప్ ట్రోఫీలో ఇండియా-బీతో జరిగిన మ్యాచులో ఇండియా-డీ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో శాంసన్ సెంచరీ చేయడంతో ఇండియా-డీ 349 పరుగులు చేసింది. మరోవైపు ఇండియా-బీ 282 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో IND-D 305 రన్స్ చేయగా 372 పరుగుల ఆధిక్యం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-బీ 115 పరుగులకే ఆలౌటైంది. ఇండియా-డీ బౌలర్ అర్షదీప్ సింగ్ 9 వికెట్లు తీశారు.
News September 22, 2024
పవన్ కళ్యాణ్తో టీటీడీ ఈవో భేటీ
AP: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీయగా, గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరఫున సంప్రోక్షణ చర్యల గురించి చర్చించారు.