News September 22, 2024
కేసీ కెనాల్ అధికారులపై మంత్రి ఆగ్రహం
నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలోని కేసీ కెనాల్ లాకుల వద్ద జలవనరుల శాఖ అధికారులు ఆదివారం గుర్రపు డెక్క, వినాయక నిమజ్జనం వ్యర్థాలు తొలగించారు. మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్న నేపథ్యంలోనే పనులు చేసినట్లు సమాచారం. కేసీ కెనాల్పై వెళ్తున్న మంత్రి తన కారు ఆపి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఏమి చేశారని ప్రశ్నించారు.
Similar News
News September 22, 2024
టీడీపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం: మంత్రి ఫరూక్
నంద్యాల పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మైనారిటీ, న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
News September 22, 2024
జగన్ వల్లే రాయలసీమకు తీవ్ర అన్యాయం: నిమ్మల
మాజీ సీఎం జగన్ కారణంగానే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇక్కడి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను దోచుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మల్యాల ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం గంగమ్మకు జలహారతి ఇచ్చారు. ఆయన వెంట నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు ఉన్నారు.
News September 22, 2024
కర్నూలులో యువతి మృతి కలకలం
కర్నూలులో యువతి మృతి కలకలం రేపింది. ధర్మపేటకు చెందిన అనురాధ(24) డిగ్రీ పూర్తి చేసింది. NBS నగర్కు చెందిన మహబూబ్ బాషా అలియాస్ చోటును ఆమె ప్రేమించగా వీరి పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారు. ఈక్రమంలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవడానికి HYD వెళ్తానని చెప్పిన అనురాధ NRపేటలో చోటుతో కలిసి నివసిస్తోంది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి అనురాధ తల్లిదండ్రులకు చోటు ఫోన్ చేసి అనురాధ ఉరేసుకున్నట్లు చెప్పాడు.