News September 22, 2024
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ దక్కని మెజారిటీ
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్థీ గెలవడానికి అవసరమైన 50% ఓట్లను దక్కించుకోలేకపోయారు. దీంతో రెండో రౌండ్ కౌంటింగ్కు (ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు) ఎన్నికల సంఘం ఆదేశించింది. మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతను ప్రకటించనున్నారు.
Similar News
News September 22, 2024
ఈ పురస్కారం తెలుగువారికి మరింత గర్వకారణం : CBN
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తన గ్రేస్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి చేశారని ట్వీట్ చేశారు. ఇది చిరంజీవికి గుర్తింపును పెంచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మరింత గర్వకారణమని పేర్కొన్నారు.
News September 22, 2024
హర్భజన్ నాకు స్ఫూర్తి: అశ్విన్
బౌలింగ్లో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు స్ఫూర్తి అని టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. బంగ్లాతో తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘హర్భజన్తో నన్ను నేను పోల్చుకోలేను. ఆయనో దిగ్గజం. జూనియర్ క్రికెట్లో భజ్జీ బౌలింగ్ యాక్షన్ను ట్రై చేస్తుండేవాడిని. నేను ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడంలో ఎంతోమంది సాయం చేశారు’ అని గుర్తుచేసుకున్నారు.
News September 22, 2024
గ్రూప్-1 మెయిన్స్పై నీలి నీడలు?
TG: OCTలో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ పరీక్షలపై హైకోర్టులో దాదాపు 20కి పైగా కేసులు ఉండటంతో నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఫైనల్ ‘కీ’లో తప్పులు, ST, EWS రిజర్వేషన్, go 29 vs 55 సహా పలు అంశాలపై కేసులు దాఖలవడమే వీరి ఆందోళనకు కారణం. ఈ అంశాలు కొలిక్కి వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం, TGPSCలను అభ్యర్థులు కోరుతున్నారు.