News September 22, 2024

పవన్ కళ్యాణ్‌తో టీటీడీ ఈవో భేటీ

image

AP: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీయగా, గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరఫున సంప్రోక్షణ చర్యల గురించి చర్చించారు.

Similar News

News September 22, 2024

హర్భజన్ నాకు స్ఫూర్తి: అశ్విన్

image

బౌలింగ్‌లో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు స్ఫూర్తి అని టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. బంగ్లాతో తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘హర్భజన్‌తో నన్ను నేను పోల్చుకోలేను. ఆయనో దిగ్గజం. జూనియర్ క్రికెట్‌లో భజ్జీ బౌలింగ్ యాక్షన్‌ను ట్రై చేస్తుండేవాడిని. నేను ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడంలో ఎంతోమంది సాయం చేశారు’ అని గుర్తుచేసుకున్నారు.

News September 22, 2024

గ్రూప్-1 మెయిన్స్‌పై నీలి నీడలు?

image

TG: OCTలో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ పరీక్షలపై హైకోర్టులో దాదాపు 20కి పైగా కేసులు ఉండటంతో నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఫైనల్ ‘కీ’లో తప్పులు, ST, EWS రిజర్వేషన్, go 29 vs 55 సహా పలు అంశాలపై కేసులు దాఖలవడమే వీరి ఆందోళనకు కారణం. ఈ అంశాలు కొలిక్కి వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం, TGPSCలను అభ్యర్థులు కోరుతున్నారు.

News September 22, 2024

OG నుంచి అప్డేట్.. తమన్ ట్వీట్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘OG’. ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. త్వరలోనే మాస్ ర్యాంపేజ్ అంటూ సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేశారు. దర్శకుడు సుజిత్, తమిళ నటుడు శింబుతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ సినిమాలో శింబు ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. దీంతో తొలి సాంగ్‌ను విడుదల చేస్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.