News September 22, 2024
అశ్విన్ ‘ది ఆల్ రౌండర్’
భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు క్రికెట్లో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్తో ముగిసిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ(113)తో అదరగొట్టి, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశారు. ఒకే మ్యాచ్లో సెంచరీ, 5వికెట్లు తీయడం అశ్విన్కిది 4వసారి. ఇయాన్ బోథమ్(5) టాప్లో ఉన్నారు. ఒకే వేదికపై(చెన్నై) ఈ ఫీట్ 2సార్లు(2021, 2024) నమోదు చేసిన ఆటగాడు మాత్రం అశ్విన్ ఒక్కరే.
Similar News
News September 22, 2024
OG నుంచి అప్డేట్.. తమన్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘OG’. ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. త్వరలోనే మాస్ ర్యాంపేజ్ అంటూ సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేశారు. దర్శకుడు సుజిత్, తమిళ నటుడు శింబుతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ సినిమాలో శింబు ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. దీంతో తొలి సాంగ్ను విడుదల చేస్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News September 22, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు?
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4,500 ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. CM రేవంత్తోపాటు సోదరులరుల ఫోన్లూ ట్యాప్ చేసినట్ల తెలుస్తోంది. ఇందులో 80 శాతం ఎయిర్టెల్ కస్టమర్లే ఉన్నట్లు సమాచారం. మాజీ OSD ప్రభాకర్ రావు, మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావులను US నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు CBI అనుమతి పొందారు. దీంతో CBI ఇంటర్పోల్కు లేఖ రాసింది.
News September 22, 2024
‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటున్నారా?
‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్లో బిస్కెట్లు తింటే అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరుతుంది. బిస్కెట్లను షుగర్, మైదాపిండితో తయారు చేయడంతో చక్కెర స్థాయులు పెరుగుతాయి. శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలూ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. హెర్బల్ టీ తాగడం ఉత్తమం.