News September 22, 2024
మోదీజీ.. ఆ ప్రాంతాల మధ్య వందే భారత్ నడపండి: బిహార్ సీఎం
బిహార్లోని సీతామఢి జిల్లా నుంచి అయోధ్య వరకు వందే భారత్ రైలు నడపాలని ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ జిల్లాలోని పునౌరా ధామ్ జానకీ మందిర్ను స్థానికులు సీతామాత జన్మస్థలంగా భావిస్తారు. ఆ ప్రాంతాన్ని ఆధ్మాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని బిహార్ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యతో కనెక్టివిటీ ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని నితీశ్ ఓ లేఖలో తెలిపారు.
Similar News
News September 23, 2024
ఈ ఎయిర్పోర్ట్ యమ డేంజర్!
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ పోర్టుల్లో భూటాన్లోని పారా విమానాశ్రయం ఒకటి. ఇక్కడ ల్యాండ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 50 మంది పైలెట్లకే అనుమతి ఉంది. వీరిని ఏవియేషన్లో డేర్ డెవిల్స్ అంటారు. ఈ రన్ వే పొడవు 2,264 మీ మాత్రమే. చుట్టూ 18 వేల అడుగుల ఎత్తైన కొండలు ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల పగలు ఫ్లైట్లు అస్సలు కదలవు. రాత్రి వేళల్లో రాడార్ పనిచేయదు. అందుకే ఇది అత్యంత డేంజర్ ఎయిర్పోర్ట్ .
News September 23, 2024
పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్లుగా వారి వైఖరి: హరీశ్
TG: మంత్రి శ్రీధర్ బాబు <<14169541>>వ్యాఖ్యలు<<>> నవ్వితే నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ సీఎల్పీ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వస్తే కలుస్తానేమో గానీ ఇలాంటి సమావేశాలకు కలవనని తేల్చి చెప్పారు. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉందని దుయ్యబట్టారు.
News September 23, 2024
సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు
1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం