News September 23, 2024

చిత్తూరు: ‘PMEGPను సద్వినియోగం చేసుకోండి’

image

ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26న పథకానికి సంబంధించి జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు విధానం, సబ్సిడీ, అర్హత గల యూనిట్ల వివరాలు తెలుస్తాయని చెప్పారు.

Similar News

News September 15, 2025

రొంపిచర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన విజయ్ కుమార్ అతని భార్య రాజేశ్వరితో కలిసి బైక్‌పై తిరుపతికి వెళుతుండగా రొంపిచర్లకు చెందిన మహమ్మద్ గౌస్ పీర్ బైక్‌పై వస్తూ ఆదర్శ పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మహమ్మద్ గౌస్ పీర్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 15, 2025

కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

image

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.

News September 15, 2025

చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.