News September 23, 2024

IPLలో వచ్చే సీజన్ కూడా ఆడనున్న ధోనీ?

image

IPLలో MS ధోనీ మరిన్ని సీజన్లు ఆడాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన మాత్రం ఆ విషయాన్ని మిస్టరీగా ఉంచుతున్నారు. అయితే త్వరలోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వచ్చేలా ఉంది. ధోనీని CSK రిటెయిన్ చేసుకోనున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దీంతో వచ్చే సీజన్ కూడా ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. ఇక ధోనీతో పాటు జడేజా, గైక్వాడ్, దూబే, పతిరణను CSK రిటెయిన్ చేసుకోనున్నట్లు సమాచారం.

Similar News

News September 23, 2024

టికెట్ లేని ప్రయాణికులపై ఫోకస్

image

పండుగల సమయాల్లో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నట్లు గుర్తించిన రైల్వే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అలాంటి వారిపై రైల్వే యాక్ట్ 1989 ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం వచ్చే నెల 1 నుంచి 15 వరకు, 25 నుంచి నవంబర్ 10 వరకు తనిఖీలు నిర్వహించనుంది.

News September 23, 2024

గోండి లిపి పండితుడు జంగు కన్నుమూత

image

TG: గోండిలిపి పండితుడు కోట్నాక్ జంగు(86) అనారోగ్యంతో మృతి చెందారు. ఆదిలాబాద్(D) నార్నూర్(మ) గుంజాల గ్రామంలో తుదిశ్వాస విడిచారు. పూర్వీకుల నుంచి గోండిలిపి నేర్చుకున్న ఆయన లిపికి సంబంధించిన ప్రతులు దాచారు. గోండు చిన్నారుల కోసం గోండి-తెలుగు వాచకాలను ప్రచురించి విద్యాబోధన చేశారు. 2014లో గుంజాలలో గోండిలిపి అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడంలో జంగు ప్రముఖుడు. ఆయన మృతిపై గోండు పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు.

News September 23, 2024

పాలస్తీనా అధ్యక్షుడిని కలిసిన ప్రధాని మోదీ

image

న్యూయార్క్‌లో జరుగుతున్న సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. పాలస్తీనాను గుర్తించిన మొదటి దేశాల్లో భారత్ ఒకటని గుర్తుచేసిన మోదీ, UNలో ఆ దేశ సభ్యత్వానికి మద్దతు తెలియజేశారు.