News September 23, 2024
ఇద్దరు మహిళల్ని ఉరి తీయించిన కిమ్ జాంగ్
ఉత్తర కొరియాలో పరిస్థితుల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఇద్దరు మహిళల్ని ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉరి తీయించారు. వారిద్దరూ చైనాలో నివాసం ఉంటున్నారు. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోవాలనుకున్న వారికి ఆ ఇద్దరూ సాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వారిని కిమ్ స్వదేశానికి రప్పించి, విచారణ చేయించి ఉరి శిక్ష అమలు చేయించారు. ఇలాంటి ఆరోపణలే ఉన్న మరో 9మందికి జీవిత ఖైదు విధించారు.
Similar News
News September 23, 2024
ఆయుష్మాన్ స్కీమ్ అమలుకు కసరత్తు
TG: డెబ్బై ఏళ్లు పైబడిన వారిని సైతం ఆయుష్మాన్ భారత్ కింద చేర్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారు 5లక్షల మంది ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. వీరందరికీ ఆయుష్మాన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనైనా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందొచ్చు.
News September 23, 2024
వేతన సవరణకు మరికొంత సమయం?
TG: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణ సిఫార్సులకై ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈ కమిటీ ఇంకా ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఆపై ఫిట్మెంట్, ఇతర అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పూర్తి నివేదిక సిద్ధం చేస్తుంది. దీని కోసం కమిటీ గడువును మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News September 23, 2024
MLA నానాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
AP: కాకినాడ(R) MLA పంతం <<14168792>>నానాజీ <<>>పట్ల వైద్యులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. కాకినాడ RMC వైద్యుడిపై దాడి చేసిన ఆయన్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. MLA, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఇవాళ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేయనుండగా, రేపు ఇతర సంఘాల మద్దతుతో కాకినాడ SPకి ఫిర్యాదు చేయనుంది. ఈ ఘటనపై MLA ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.