News September 23, 2024
సారవకోట: ఆంధ్రరాష్ట్ర చిహ్నంలో పూర్ణ కుంభం తయారీ

సారవకోట మండలం బూతడి గ్రామంలో ప్రాఖ్యత గాంచిన కంచు, ఇత్తడి కార్మికులు తమ నైపుణ్యంతో ఆంధ్రరాష్ట్ర చిహ్నంలో ఉన్న పూర్ణ ఘటం తయారు చేశారు. గ్రామానికి చెందిన కింతాడ అప్పారావు ఆయన కుమారుడు బుజ్జి సుమారు 40 రోజులు శ్రమించి 12 కేజీల ఇత్తడితో ఈ పూర్ణకుంభం తయారు చేశారు. దీనిని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు తయారీ దారులు తెలిపారు.
Similar News
News March 6, 2026
శ్రీకాకుళంలో ఆ అద్భుత ఘట్టానికి వేళాయే

శ్రీకాకుళం ప్రత్యక్షదైవం ఆరోగ్యప్రదాత అరసవల్లి ఆదిత్యుని మూలవిరాటుపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఈ నెల 9, 10 తేదీల్లో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ, ఆలయ ఈవో K.N.V.D.V ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ఆదిత్యుని పాదాలపై నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి.
News March 5, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

☞ఎచ్చెర్ల: వర్సిటీలో యూత్ పార్లమెంట్ కార్యక్రమం
☞శ్రీకాకుళం: మహిళ భద్రతకు ప్రాధాన్యత
☞ఈనెల 9,10 తేదీల్లో ఆదిత్యుని కిరణ స్పర్శ
☞నరసన్నపేట: శవ గదికెళ్లాలంటే పరీక్షే
☞శ్రీకాకుళంలో మర్డర్..నిందితుడి అరెస్ట్
☞అచ్చెన్న మంత్రి పదవికి రాజీనామా చేయాలి: పేరాడ తిలక్
☞SKLM: మార్చి 8న అస్మిత అథ్లెటిక్స్ పోటీలు
☞కరగాం: గుండెపోటుతో యువ ఇంజినీర్ మృతి
News March 5, 2026
వే2 న్యూస్ కథనానికి స్పందన..తీరిన దివ్యాంగుడి పెన్షన్ టెన్షన్

పొందూరు(M) బొట్లపేట వాసి నవీన్ 100% దివ్యాంగుడు. గతంలో వచ్చిన పింఛన్ నిలిచిపోయింది. అచేతనంగా కదలలేని స్థితిలోనున్న నవీన్ను భుజంపై మోసుకొని తల్లిదండ్రులు అధికారులు, కార్యాలయాల చుట్టు తిరిగినా సమస్య తీరలేదు. దీనిపై Way2Newsలో OCT22, 2025న ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’ అనే శీర్షికతో కథనం వచ్చింది. అనంతరం వచ్చిన వార్తలకు MLA కూన స్పందించి ఉన్నతాధికారులకు నివేదికివ్వగా పింఛన్ మంజారైంది.


