News September 23, 2024
ఉమ్మడి విశాఖలో 16 మంది తహశీల్దార్లు బదిలీ

ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 మంది తహశీల్దార్లను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో 8 మందిని విశాఖ జిల్లాకు, ఐదుగురిని అనకాపల్లి జిల్లాకు, ముగ్గురిని అల్లూరి జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో ఎంబీ అప్పారావు, పీ.లచ్చాపాత్రుడు, ఎస్.రాణి అమ్మాజీ, కే.జానకమ్మ, ఎస్.రామారావు, ఏ.శ్రీనివాసరావు, కే.రమాదేవి, ఎస్.నాగమ్మ, వేణుగోపాల్, శ్యామ్ కుమార్, కే.జయ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
Similar News
News January 9, 2026
జిల్లా రివ్యూలో ఎమ్మెల్యే పల్లా సూచనలు

జిల్లా రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగం పరిధిలో నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు, మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు పరిశీలించాలన్నారు.
News January 9, 2026
విశాఖ: గాలి నాణ్యత పెరిగేందుకు చర్యలు

విశాఖలో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన DRC సమావేశంలో ఆయన మాట్లాడారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమన్నారు. టార్పలిన్లు లేకుండా బొగ్గు, ఇసుక, ఇతర సామగ్రిని రవాణా చేయొద్దని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News January 9, 2026
విశాఖ కలెక్టరేట్లో నగర అభివృద్ధిపై సమీక్ష

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించనున్నారు. భూ కేటాయింపులు, శంకుస్థాపనలు, అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.


