News September 23, 2024

తిరుపతి: యువకుడిపై పొక్సో కేసు

image

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతి శివారులో ఉన్న తల్లి, తండ్రి బతుకుతెరువు కోసం బెంగళూరుకు వెళుతూ.. బాలికను అవ్వ దగ్గర వదిలారు. వరుసకు చెల్లి(13) అయిన బాలికపై యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వినాయక చవితికి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News March 3, 2026

చిత్తూరు జిల్లాలో వారికి వారం రోజుల గడువు

image

గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, వివిధ క్లినిక్లకు చిత్తూరు DMHO సుధారాణి కీలక సూచనలు చేశారు. APMCE చట్టం ప్రకారం అనుమతి పొందేలా వారం రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ యూనిట్లు డీఎంహెచ్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 3, 2026

చిత్తూరు పోలీసులకు 54 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News March 2, 2026

చిత్తూరు: పన్ను వసూళ్లకు 15 వరకు గడువు

image

చిత్తూరు జిల్లాలో పంచాయతీల్లో పన్నుల వసూళ్ల గడువును ఈనెల 15 వరకు ఇచ్చినట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలో 75 శాతం వసూళ్లు చేసినట్లు వెల్లడించారు. మొత్తం లక్ష్యం రూ.27.41 కోట్లు కాగా అందులో 75 శాతం అంటే రూ.20.55 కోట్లు రాబట్టామన్నారు. 15వ తేదీలోపు మిగిలిన 25 శాతం పన్నులను వసూలు చేయడానికి కృషి చేస్తామని వివరించారు.