News September 23, 2024

MLA నానాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్

image

AP: కాకినాడ(R) MLA పంతం <<14168792>>నానాజీ <<>>పట్ల వైద్యులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. కాకినాడ RMC వైద్యుడిపై దాడి చేసిన ఆయన్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. MLA, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఇవాళ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేయనుండగా, రేపు ఇతర సంఘాల మద్దతుతో కాకినాడ SPకి ఫిర్యాదు చేయనుంది. ఈ ఘటనపై MLA ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.

Similar News

News September 23, 2024

భారత్ నుంచి ఆస్కార్ బరిలో ‘లాపతా లేడీస్’

image

ఆస్కార్స్-2025కు భారత్ నుంచి హిందీ సినిమా ‘లాపతా లేడీస్’ను పంపనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీ పడనుంది. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని అమీర్ ఖాన్, జ్యోతి దేశ్‌పాండ్ నిర్మించారు. మార్చిలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

News September 23, 2024

గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

image

ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లేనని ముంబై లీలావతి హాస్పిటల్‌ కార్డియాలజిస్ట్ డా.రవీందర్ తెలిపారు. అయితే వయసు, లింగాన్ని బట్టి కొన్ని మార్పులుంటాయన్నారు. ‘కొందరు గంటలో 6KMS నడిస్తే, మరికొందరు అంతకంటే తక్కువగా నడుస్తారు. కానీ ఆగకుండా నడుస్తున్నారంటే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే చెడు అలవాట్లను వదిలి, రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది’ అని తెలిపారు.

News September 23, 2024

లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వైవీ సుబ్బారెడ్డి

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మ.2:15 గంటలకు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.