News September 23, 2024
ఆయుష్మాన్ స్కీమ్ అమలుకు కసరత్తు
TG: డెబ్బై ఏళ్లు పైబడిన వారిని సైతం ఆయుష్మాన్ భారత్ కింద చేర్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారు 5లక్షల మంది ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. వీరందరికీ ఆయుష్మాన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనైనా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందొచ్చు.
Similar News
News September 23, 2024
భారత్ నుంచి ఆస్కార్ బరిలో ‘లాపతా లేడీస్’
ఆస్కార్స్-2025కు భారత్ నుంచి హిందీ సినిమా ‘లాపతా లేడీస్’ను పంపనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీ పడనుంది. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని అమీర్ ఖాన్, జ్యోతి దేశ్పాండ్ నిర్మించారు. మార్చిలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
News September 23, 2024
గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి!
ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లేనని ముంబై లీలావతి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా.రవీందర్ తెలిపారు. అయితే వయసు, లింగాన్ని బట్టి కొన్ని మార్పులుంటాయన్నారు. ‘కొందరు గంటలో 6KMS నడిస్తే, మరికొందరు అంతకంటే తక్కువగా నడుస్తారు. కానీ ఆగకుండా నడుస్తున్నారంటే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే చెడు అలవాట్లను వదిలి, రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది’ అని తెలిపారు.
News September 23, 2024
లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వైవీ సుబ్బారెడ్డి
AP: తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మ.2:15 గంటలకు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.