News September 23, 2024
కోదండరాంకు రేపు TJAC సన్మానం
TJAC ఆధ్వర్యంలో ఈ నెల 24న MLC కోదండరాంను సన్మానించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన అప్పటి తమ ఛైర్మన్ కోదండరాం కృషి మరువలేనిదని JAC నేతలు అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత ఆయనకు MLC ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, గెజిటెడ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రూప్-1 ఇలా 205 సంఘాలతో JAC ఏర్పాటైందని గుర్తు చేశారు.
Similar News
News September 23, 2024
దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే
TG: హైదరాబాద్లోని దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. అక్కడ హైడ్రా కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టు స్టే ఇచ్చింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నివాసితులు హాజరు కావాలని ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పింది.
News September 23, 2024
రూ.30 కోట్లు రాబట్టిన ‘మత్తు వదలరా-2’
శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మత్తు వదలరా-2’ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. దీంతో సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. పదిరోజుల్లో ఈ సినిమాకు రూ.30.1 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు అమెరికాలోనూ $1 మిలియన్ దాటేసినట్లు తెలిపారు. ఈ సినిమాను రితేశ్ రాణా తెరకెక్కించారు.
News September 23, 2024
10 మంది MLAలకు హైకోర్టు నోటీసులు
TG: ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.