News September 23, 2024

రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు? సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యిందని మంత్రులు చెప్పారు. మరి వైరా దిగువన ఉన్న రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు? రుణమాఫీ చేస్తానని భద్రాద్రి రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు. వరద బాధితులకు ఇప్పటివరకు పూర్తి పరిహారం ఇవ్వలేదు’ అని ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు.

Similar News

News September 23, 2024

మంత్రి సీతక్కతో నమ్రత

image

TG: సీఎం రేవంత్ నివాసంలో మంత్రి సీతక్కను సినీ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత కలిశారు. మంత్రితో కాసేపు ముచ్చటించారు. మహేశ్ బాబు, నమ్రత ఇవాళ ఉదయం సీఎం రేవంత్‌ను కలిసి వరద బాధితుల కోసం రూ.60 లక్షల చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే.

News September 23, 2024

పిల్లలిద్దరూ ప్రయోజకులైతే.. ఆ తల్లికింకేం కావాలి!

image

పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. వారికి నచ్చిన చదువు, నైపుణ్యం ఉన్న క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు వెనకాడరు. అయితే, కొందరు మాత్రమే ప్రయోజకులై తల్లిదండ్రులకు, ఊరికి, దేశానికి పేరుతెస్తుంటారు. దేశానికి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లను అందించిన ప్రజ్ఞానంద, వైశాలీల తల్లి నాగలక్ష్మి ఈరోజు ఎంతో గర్వపడి ఉంటారు. కూతురు, కుమారుడు ఇద్దరూ నేడు ప్రపంచ ఛాంపియన్లయ్యారు.

News September 23, 2024

రేపు ఉ.10 గం.కు రూ.300 టోకెన్లు విడుదల

image

డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం (రూ.300) టోకెన్లను రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి గదుల కోటాను రేపు మ.3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు, టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలని పేర్కొంది.