News September 23, 2024
‘దేవర’ ఈవెంట్ను అందుకే రద్దు చేశాం: శ్రేయాస్ మీడియా
‘దేవర’ ఈవెంట్ రద్దుపై శ్రేయాస్ మీడియా ప్రెస్నోట్ రిలీజ్ చేసింది. ‘పోలీసులు 4వేల మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చారు. కానీ 30-35 వేల మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్యాన్స్ సేఫ్టీ కోసమే ఈవెంట్ రద్దు చేశాం. మమ్మల్ని క్షమించండి. అవుట్ డోర్ ఈవెంట్ కోసం ప్రయత్నించాం. కానీ గణేశ్ నిమజ్జనం, వెదర్ అలర్ట్స్ వల్ల సాధ్యం కాలేదు. పరిమితికి మించి పాసులు జారీ చేశామన్న ఆరోపణలు అవాస్తవం’ అని పేర్కొంది.
Similar News
News September 23, 2024
పిడుగుపడి ఒకే చోట 8 మంది మృతి.. అందులో ఆరుగురు విద్యార్థులు..
ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో పిడుగుపాటుకు 8 మంది మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో ఆరుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు భారీ వర్షం కారణంగా ఒక చెట్టు కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగుపడటంతో విద్యార్థులు మృతి చెందినట్టు కలెక్టర్ సంజయ్ అగర్వాల్ ధ్రువీకరించారు.
News September 23, 2024
మంత్రి సీతక్కతో నమ్రత
TG: సీఎం రేవంత్ నివాసంలో మంత్రి సీతక్కను సినీ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత కలిశారు. మంత్రితో కాసేపు ముచ్చటించారు. మహేశ్ బాబు, నమ్రత ఇవాళ ఉదయం సీఎం రేవంత్ను కలిసి వరద బాధితుల కోసం రూ.60 లక్షల చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే.
News September 23, 2024
పిల్లలిద్దరూ ప్రయోజకులైతే.. ఆ తల్లికింకేం కావాలి!
పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. వారికి నచ్చిన చదువు, నైపుణ్యం ఉన్న క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు వెనకాడరు. అయితే, కొందరు మాత్రమే ప్రయోజకులై తల్లిదండ్రులకు, ఊరికి, దేశానికి పేరుతెస్తుంటారు. దేశానికి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లను అందించిన ప్రజ్ఞానంద, వైశాలీల తల్లి నాగలక్ష్మి ఈరోజు ఎంతో గర్వపడి ఉంటారు. కూతురు, కుమారుడు ఇద్దరూ నేడు ప్రపంచ ఛాంపియన్లయ్యారు.