News September 23, 2024
భారత్ నుంచి ఆస్కార్ బరిలో ‘లాపతా లేడీస్’
ఆస్కార్స్-2025కు భారత్ నుంచి హిందీ సినిమా ‘లాపతా లేడీస్’ను పంపనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీ పడనుంది. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని అమీర్ ఖాన్, జ్యోతి దేశ్పాండ్ నిర్మించారు. మార్చిలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Similar News
News September 23, 2024
కేజీ ఉల్లి రూ.35.. సప్లైకి సిద్ధంగా 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్
ఉల్లి ధరలకు కళ్లెమేసేందుకు బఫర్ స్టాక్ను కేంద్రం హోల్సేల్ మార్కెట్లకు సప్లై చేయనుంది. ఇప్పటికే కొన్ని సిటీల్లో NCCF, NAFED ద్వారా కిలో రూ.35కే అమ్ముతున్నట్టు ప్రకటించింది. ‘ఎగుమతి సుంకం ఎత్తేయడంతో ఉల్లి ధరలు పెరుగుతాయని ముందే అంచనా వేశాం. అందుకే మావద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ను సబ్సిడీతో విక్రయిస్తాం’ అని కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి అన్నారు. ప్రస్తుతం కేజీ ఉల్లి రూ.60గా ఉంది.
News September 23, 2024
మైనారిటీల పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలి: CM
AP: ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకోవాలని సూచించారు. మైనారిటీ సంక్షేమంపై సచివాలయంలో మంత్రి ఫరూక్, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
News September 23, 2024
వాళ్లిద్దరూ లేకుండా భారత్లో టెస్టు మ్యాచ్ ఉండదు: అక్మల్
భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ లేకుండా భారత్ స్వదేశంలో టెస్టు ఆడటాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. ‘6 వికెట్లు, సెంచరీతో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశారు. జడ్డూ-అశ్విన్ది మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం. ఇక ఘోర ప్రమాదం తర్వాత పంత్ సైతం అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులకు హ్యాట్సాఫ్’ అని కొనియాడారు.