News September 23, 2024
రూ.30 కోట్లు రాబట్టిన ‘మత్తు వదలరా-2’
శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మత్తు వదలరా-2’ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. దీంతో సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. పదిరోజుల్లో ఈ సినిమాకు రూ.30.1 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు అమెరికాలోనూ $1 మిలియన్ దాటేసినట్లు తెలిపారు. ఈ సినిమాను రితేశ్ రాణా తెరకెక్కించారు.
Similar News
News September 23, 2024
పిల్లలకు లైంగిక విద్య అవసరం: సుప్రీం కోర్టు
పిల్లలకు లైంగిక విద్య అత్యంత ఆవశ్యకమని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని పేర్కొంది. ‘లైంగిక విద్య పాశ్చాత్యుల విధానమని, మన వద్ద ప్రారంభిస్తే పిల్లలు చెడిపోతారని ఓ దుష్ప్రచారం ఉంది. ఓ అధ్యయనం ప్రకారం.. సమగ్ర సెక్స్ ఎడ్యుకేషన్ వారిలో అవగాహనను పెంచుతుంది. తద్వారా వారు పోర్న్కు, లైంగిక నేరాలకు అలవాటు పడకుండా ఆపే అవకాశం ఉంటుంది’ అని తెలిపింది.
News September 23, 2024
అదే జరిగితే 75% మంది UPI సేవల వినియోగాన్ని ఆపేస్తారు
UPI చెల్లింపులకు రుసుములు విధిస్తే మెజారిటీ యూజర్లు వాటి వినియోగాన్ని తగ్గించేస్తారని లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తే 75 శాతం మంది UPI సేవల వాడకాన్ని వదిలేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది డిజిటల్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. 38% యూజర్లు రోజులో సగం చెల్లింపులకు UPI వాడుతున్నారు. 10 మంది యూజర్లలో నలుగురు UPIకి ప్రాధాన్యమిస్తున్నారు.
News September 23, 2024
భారత్లో ఎంపాక్స్ క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధారణ
కేరళలో గత వారం ఎంపాక్స్ పాజిటివ్గా తేలిన వ్యక్తిలో క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధారణ అయ్యింది. ఈ స్ట్రెయిన్ వల్లే డబ్ల్యూహెచ్ఓ గత నెలలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చిన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ స్ట్రెయిన్ను గుర్తించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.