News September 23, 2024
అదే జరిగితే 75% మంది UPI సేవల వినియోగాన్ని ఆపేస్తారు
UPI చెల్లింపులకు రుసుములు విధిస్తే మెజారిటీ యూజర్లు వాటి వినియోగాన్ని తగ్గించేస్తారని లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తే 75 శాతం మంది UPI సేవల వాడకాన్ని వదిలేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది డిజిటల్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. 38% యూజర్లు రోజులో సగం చెల్లింపులకు UPI వాడుతున్నారు. 10 మంది యూజర్లలో నలుగురు UPIకి ప్రాధాన్యమిస్తున్నారు.
Similar News
News September 23, 2024
అనర్హుల పెన్షన్లు తొలగించాలి: సీఎం చంద్రబాబు
AP: వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు, అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనర్హులు స్వచ్ఛందంగా తమ పెన్షన్లను వదులుకోవాలని సీఎం సున్నితంగా హెచ్చరించారు.
News September 23, 2024
కేతిరెడ్డిపై మంత్రి సత్య కుమార్ విమర్శలు
AP: ధర్మవరం సబ్ జైలు వద్ద మాజీ MLA కేతిరెడ్డి <<14175931>>వాహనంపై<<>> టీడీపీ కార్యకర్త ఎక్కగా దూసుకెళ్లిన ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలకు దిగారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయారని దుయ్యబట్టారు. గతంలో చేసిన తప్పులు, కబ్జాలు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని ట్వీట్ చేశారు.
News September 23, 2024
మహీంద్రా థార్ రాక్స్ తొలి కారు వేలం.. ఎంత పలికిందంటే..
మహీంద్రా సంస్థ తమ థార్ కారుకు అప్డేట్గా థార్ రాక్స్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో తయారుచేసిన తొట్టతొలి కారును ఛారిటీ కోసం తాజాగా వేలం వేయగా ఏకంగా రూ.1.31 కోట్లకు అమ్ముడుపోయింది. VIN 0001 ఛాసిస్ నంబర్ కలిగిన ఈ కారు AX7 L డీజిల్ 4×4 టాప్ వేరియెంట్. ఆనంద్ మహీంద్రా సంతకం ఈ కారుకు మరో ప్రత్యేకత. రాక్స్ బేస్ వేరియెంట్ ఆన్రోడ్ ధర రూ.16 లక్షలుగా ఉంది.