News September 23, 2024
కడప హజ్ హౌస్ను త్వరగా పూర్తి చేయాలి: చంద్రబాబు

సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం పలు విషయాల గురించి చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా.. కడపలో రూ.15 కోట్లతో నిర్మిస్తున్న హజ్ హౌస్ నిర్మాణం గురించి అధికారులను అడిగారు. 80% పూర్తయిందని తెలుపగా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదివరకు ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
Similar News
News January 22, 2026
జాతీయ స్థాయి ఇస్తేమాకు భారీ భద్రత: కడప ఎస్పీ

కడప నగర శివార్లలోని కొప్పర్తి పరిసర ప్రాంతాలలో ఈనెల 23, 24, 25 తేదీలలో నిర్వహించనున్న ఇస్తేమా కార్యక్రమానికి భారీ బందోబస్తును ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో పోలీసు శాఖ నిర్వహించనుంది. 6 మంది డీఎస్పీలు, 32 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఇంకా ఇతర సిబ్బందితో కలిపి 700 మంది మన జిల్లాకు సంబంధించిన వారు బందోబస్తు విధులను నిర్వహించనున్నారు. ఇంకా పక్క జిల్లాల నుంచి బందోబస్తుకు రానున్నారు.
News January 22, 2026
కడప: ‘ఇసుక రీచులు, స్టాక్ పాయింట్లపై పర్యవేక్షణ’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని, ఇసుక రీచులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత, నూతన ఇసుక రీచ్ల గుర్తింపు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు.
News January 22, 2026
కడప: ‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి’

కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేయాలని కోరారు.


