News September 24, 2024
సెప్టెంబర్ 24: చరిత్రలో ఈరోజు
1921: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి జననం
1972: దర్శకుడు శ్రీను వైట్ల జననం
1950: భారత మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ జననం
1975: ప్రముఖ దర్శకుడు, నిర్మాత చక్రపాణి మరణం
2004: భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న మరణం
✤ఎన్ఎస్ఎస్ దినోత్సవం
Similar News
News September 24, 2024
ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త
TG:బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, బీమా రంగాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 10 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దేశంలో తొలిసారిగా ఓ కోర్సును తీసుకొస్తోంది. దీనిని ఈ నెల 25న CM రేవంత్ ప్రారంభిస్తారు. 18 ఇంజినీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో అమలు చేసి కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్, ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగమూ లభించేలా చూస్తారు.
News September 24, 2024
BIG ALERT.. భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, NLG, SRPT, RR, VKB, SRD, మెదక్, కామారెడ్డి, MBNR, NGKL, WNP, NRPT, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL, కర్నూలు, నంద్యాల, YSR, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
News September 24, 2024
ట్రిపుల్ ఐటీల్లో రేషన్ బియ్యంతో భోజనం: TDP ఎమ్మెల్సీ
AP: ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని టీడీపీ MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్కు ఆయన లేఖ రాశారు. నిర్వాహకులు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి విద్యార్థులకు పెడుతున్నారని ఆక్షేపించారు. మసూరి రకం బియ్యాన్నే వాడాలన్న నిబంధనను పట్టించుకోవట్లేదని విమర్శించారు. IIITల్లో క్యాంటీన్లు, దుకాణాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాలని కోరారు.