News September 24, 2024

ట్రిపుల్ ఐటీల్లో రేషన్ బియ్యంతో భోజనం: TDP ఎమ్మెల్సీ

image

AP: ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని టీడీపీ MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌కు ఆయన లేఖ రాశారు. నిర్వాహకులు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి విద్యార్థులకు పెడుతున్నారని ఆక్షేపించారు. మసూరి రకం బియ్యాన్నే వాడాలన్న నిబంధనను పట్టించుకోవట్లేదని విమర్శించారు. IIITల్లో క్యాంటీన్లు, దుకాణాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాలని కోరారు.

Similar News

News September 24, 2024

వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

image

AP: YCP నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చారు. తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మారెడ్డే ప్రధాన కారణం. ఇంత జరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. YCP నేతలు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడొద్దు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 24, 2024

స్కూల్‌కి రూ.125 కోట్ల విరాళం.. నెట్టింట భిన్నాభిప్రాయాలు!

image

ఫేస్‌బుక్ కోఫౌండర్ ఎడ్వర్డో సావెరిన్ గొప్ప మనసు చాటుకున్నారు. సింగపూర్ అమెరికన్ స్కూల్‌‌కు $15.5M (₹125 కోట్లు) విరాళమిచ్చారు. స్కూల్ ఈ మొత్తాన్ని ల్యాబ్స్, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి ఖర్చు చేయనుంది. అయితే ఇదొక ప్రైవేట్ స్కూల్. ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి $47,000 ఫీజు వసూలు చేస్తుంది. ఇలాంటి ప్రైవేట్ స్కూల్‌కి కాకుండా చారిటీ స్కూల్స్‌కి డొనేట్ చేయాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

News September 24, 2024

అంబానీ కుమారుడికి సెబీ ఫైన్

image

అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీకి సెబీ షాకిచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో అవకతవకల కేసులో రూ.కోటి ఫైన్ వేసింది. కంపెనీ జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ రూల్స్‌ను ఆయన పాటించలేదని చెప్పింది. వీసా క్యాపిటల్ పార్ట్‌నర్స్, అక్యూరా ప్రొడక్షన్ కంపెనీలకు రూ.20 కోట్ల చొప్పున అన్ సెక్యూర్డ్ లోన్లకు అనుమతించారని వెల్లడించింది. తాము పంపిన ఈ‌మెయిల్స్‌కు ‘ఓకే’ అని బదులివ్వడమే దీనికి నిదర్శనమంది.