News September 24, 2024
నవోదయ పాఠశాల ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు తేదీని అక్టోబర్ 7 తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. సెప్టెంబర్ 23తో గడువు ముగియనుండగా దాన్ని అక్టోబర్ 7 వరకు పెంచారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. https://navodaya.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
Similar News
News February 24, 2026
NZB: కలెక్టర్, సీపీతో రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ భేటీ

రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను భేటీ అయ్యారు. మైనార్టీ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయాలని, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మైనార్టీ విద్యాలయాల్లో పూర్తి స్థాయి అడ్మిషన్లు జరిగేలా చూడాలని, ప్రభుత్వ సదుపాయాలపై అవగాహన పెంచాలని పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి పాల్గొన్నారు.
News February 24, 2026
NZB: దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ

NZB జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీస్ కమీషనర్ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. మోపాల్ మండల పరిధిలోని కాల్పోల్, రుద్రూర్, ఆనంద్ నగర్, నగరంలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
News February 24, 2026
NZB: ఈనెల 25న జాబ్ మేళా

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బి.ఫార్మా, డి.ఫార్మా, ఎం.ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.


