News September 24, 2024
గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని డిమాండ్

TG: SC, ST, BC, మైనార్టీ, జనరల్ గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని గురుకుల విద్యా JAC డిమాండ్ చేసింది. నైట్ స్టడీ అవర్స్ అనంతరం రా.9 గంటలకు ఇళ్లకు వెళ్లేందుకు మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారంది. టైమింగ్స్ మార్చకపోతే ఈ నెల 28న చాక్ డౌన్, పెన్ డౌన్ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో పాటు మెస్ ఛార్జీలు పెంచాలని, 010 కింద జీతాలు, కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరింది.
Similar News
News November 12, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హోంమంత్రి అనిత సూచించారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని మంత్రి సత్యప్రసాద్ ఫైరయ్యారు. సెంటు పట్టా పేరుతో ₹7,500Cr దోచుకున్నారని ఆరోపించారు.
* శ్రీకాకుళం IIITలో సృజన్(20) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్కు కారణాలు తెలియరాలేదు.
News November 12, 2025
NIT వరంగల్లో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (<
News November 12, 2025
పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని

ఢిల్లీ LNJP ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల బృందంతో సమావేశమై మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 12 మంది పౌరులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు.


