News September 24, 2024
పారిపోయి కొండల్లో దాక్కున్న విద్యార్థులు!

AP: పల్నాడు(D) వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు. మరో 37మంది కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని, బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండటంతో వారు పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు.
Similar News
News January 13, 2026
ఇరాన్ నిరసనల్లో 12 వేల మంది చనిపోయారా?

ఇరాన్ నిరసనల్లో 2వేల మంది <<18846903>>చనిపోయారని<<>> వార్తలు వచ్చాయి. కానీ అక్కడి ప్రతిపక్షాలు మాత్రం భద్రతా దళాల కాల్పుల్లో 12వేల మంది చనిపోయారని సంచలన ఆరోపణలు చేశాయి. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద మారణకాండ అని, లెక్కలోకి రాని మరణాలు వందల్లో ఉండొచ్చని Iran International సంస్థ చెప్పింది. ఈనెల 8, 9తేదీల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, బాసిజ్ యూనిట్లు చేసిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయారని తెలిపింది.
News January 13, 2026
త్వరలో 10వేల పోస్టుల భర్తీ: మంత్రి దామోదర

TG: త్వరలోనే ఆరోగ్యశాఖలో 10వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. HYD కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు ఆరోగ్యశాఖలో 9,572 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. జంట నగరాల్లో 145 పాలిక్లినిక్లు, రాష్ట్రంలో 80 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆరోగ్యభద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు.
News January 13, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’.. చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీకి చిరు కూతురు సుష్మిత కో-ప్రొడ్యూసర్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు రూ.కోటితో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు రూ.50 కోట్లు, భోళా శంకర్కు రూ.63 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.


