News September 24, 2024
ఆర్టీసీ ఉద్యోగులకు రూ.25వేల రుణం

AP: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, సహకార సంఘం సభ్యులకు రూ.25 వేల వరద రుణం మంజూరు చేయాలని ఆ సంఘం నిర్ణయించింది. వరదలతో పూర్తిగా నష్టపోయిన వారికి ఈ రుణాన్ని అందిస్తారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని డిపోలు, విజయవాడలోని నాన్ ఆపరేషన్ యూనిట్లు, ఎండీ కార్యాలయంలో పని చేసే వారికి ఇది వర్తిస్తుందని సంఘం కార్యదర్శి తెలిపారు. రుణం కావాల్సిన వారు సంబంధిత డిపో, యూనిట్ మేనేజర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News February 1, 2026
NIMHRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మధ్యప్రదేశ్ సెహోర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ (<
News February 1, 2026
‘లిట్టర్’ నిర్వహణ.. కోళ్ల ఫారాల్లో ముఖ్యం

కోళ్ల ఫారాలలో నేలపై ఎండు గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో లిట్టర్ ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.
News February 1, 2026
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రిషబ్ శెట్టి

కాంతార సినిమాలతో పాపులర్ అయిన రిషబ్ శెట్టి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమాకు రూ.80కోట్లు అడుగుతున్నట్టు చర్చ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందే పీరియాడిక్ డ్రామాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


