News September 24, 2024
హజ్ యాత్రకు రూ.లక్ష సాయం: CM

AP: హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష, మసీదుల నిర్వహణ కోసం రూ.5వేలు సాయం అందించే స్కీమ్లకు రూపకల్పన చేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించారు. పాస్టర్లకు నెలకు రూ.5వేలు, ఇమామ్, మౌజమ్లకు నెలకు రూ.10 వేలు, రూ.5వేల గౌరవ వేతనం, MSMEలకు రాయితీ రుణాలు ఇస్తామన్న హామీలను అమల్లోకి తీసుకురావాలన్నారు. వక్ఫ్ భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.
Similar News
News September 14, 2025
పెదాలు అందంగా ఉండాలంటే

పెదాలు అందంగా, తాజాగా ఉండాలంటే మీ స్కిన్కేర్లో లిప్ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇది చూడటానికి లిప్గ్లాస్లా ఉంటుంది. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలు పగలకుండా చూస్తాయి. వీటిని లిప్స్టిక్కి జత చేస్తే పెదాలు ఎక్స్ట్రా షైనీగా ఉంటాయి. లిప్ఆయిల్స్లో ఉండే విటమిన్స్, ఫ్యాటీయాసిడ్స్ లిప్బామ్ కంటే ఎక్కువ హైడ్రేషన్ ఇస్తాయి. వీటిలో కూడా SPF ఉండేవి వాడితే యూవీ కిరణాల నుంచి పెదాలని రక్షిస్తాయి.
News September 14, 2025
BJP భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది: సత్యకుమార్

AP: డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. PVN మాధవ్ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా APని తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా BJP ఇంకా విస్తరించాల్సి ఉంది’ అని అన్నారు.
News September 14, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించే ఏఐ

అధునాతన చికిత్సా విధానాలెన్నున్నా ఇప్పటికీ మహిళల్లో రొమ్ముక్యాన్సర్తో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి USలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మిరాయ్ అనే ఏఐ సాధనాన్ని తయారుచేశారు. ఇది ఐదేళ్ల ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తిస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే మిరాయ్ రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.