News September 24, 2024
భీకర యుద్ధం: 500కు చేరిన మృతుల సంఖ్య
హెజ్బొల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 500 మందికిపైగానే మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు 100కుపైగా ఉన్నారు. 1,650 మందికిపైగా గాయపడ్డారు. 2006 తర్వాత లెబనాన్పై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2006లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 1,300 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.
Similar News
News September 24, 2024
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
AP: రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ <
News September 24, 2024
తెలుగులోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ‘కిల్’ మూవీ తెలుగులో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష్య, తాన్య, రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ మూవీ జులై 5న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. సెప్టెంబర్ 6 నుంచి డిస్నీ+హాట్స్టార్లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఇవాళ్టి నుంచి తెలుగు, తమిళం వెర్షన్లలో కూడా అందుబాటులోకి రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
News September 24, 2024
ఆల్కహాల్ సేవించాక ఇంగ్లిష్లో ఎందుకు మాట్లాడతారు?
ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? ఇలాంటివి మీకు తెలిసిన వారిలో ఎవరో ఒకరు చేసుంటారు. అయితే, దీని వెనుక సైన్స్ ఉందని సైకోఫార్మాకాలజీ జర్నల్లో ప్రచురించారు. ‘మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మాతృభాష కంటే కూడా రెండో భాష, ప్రత్యేకించి ఇంగ్లిష్లో మాట్లాడుతుంటారు. దానిపైనే తక్కువ పట్టు ఉందనే ఆందోళనను దరిచేరనీయరు. అదేవ్యక్తి మత్తు తగ్గాక ఇంగ్లిష్లో మాట్లాడేందుకు సంకోచిస్తారు’ అని జర్నల్లో ఉంది.