News September 24, 2024

ఘోరం.. నర్సింగ్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్

image

కోల్‌కతా లేడీ డాక్టర్‌పై హత్యాచార ఘటన మరవకముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. దిండిగల్ జిల్లాలో స్వస్థలం తెని నుంచి బయలుదేరిన ఓ నర్సింగ్ స్టూడెంట్‌ను కొందరు దుండగులు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. పోలీసులు ఆమెను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Similar News

News September 24, 2024

రైతు హామీల సాధన కోసం ఈనెల 30న బీజేపీ దీక్ష

image

TG: రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతు హామీల సాధన కోసం ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని చెప్పారు.

News September 24, 2024

జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్.. రేపు తీర్పు

image

జానీ మాస్టర్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. దీనిపై రంగారెడ్డి కోర్టు రేపు తీర్పును వెల్లడించనుంది. మరోవైపు బెయిల్ పిటిషన్‌పై వాదనలు రేపు కూడా కొనసాగనున్నాయి. అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో అరెస్టైన జానీ మాస్టర్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News September 24, 2024

దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోండి: కేటీఆర్

image

TG: హైడ్రా పేరుతో పేదల బతుకులను ప్రభుత్వం రోడ్డుపై వేస్తుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నిర్మాణ అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.