News September 24, 2024
భారత్, చైనా ఫైట్లో సాండ్విచ్ అవ్వలేం: దిసనాయకే
జియో పొలిటికల్ రైవల్రీకి శ్రీలంకను దూరంగా ఉంచుతానని ప్రెసిడెంట్ దిసనాయకే అన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల్లో సమతూకం పాటిస్తానని చెప్పారు. ‘ఆ ఫైట్కు మేం దూరంగా ఉంటాం. అలాగే ఏదో ఒక పక్షం వైపు ఉండం. ప్రత్యేకించి భారత్, చైనా మధ్య సాండ్విచ్ అవ్వలేం. ఆ 2 మాకు మిత్రదేశాలే. అవి మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాం. EU, మిడిల్ఈస్ట్, ఆఫ్రికాతో సంబంధాలు కొనసాగిస్తాం’ అని తన ఫారిన్ పాలసీ గురించి వివరించారు.
Similar News
News September 24, 2024
నాకు యూట్యూబ్ ఛానల్ లేదు: రోజా
AP: తాను సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండటానికి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నానని మాజీ మంత్రి రోజా చెప్పారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని స్పష్టం చేశారు. తన పేరుతో ఉన్న ఫేక్ ఛానళ్లను డిలీట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన పేరుతో బ్లూటిక్ ఉన్న అకౌంట్లను మాత్రమే ఫాలో కావాలని సూచించారు.
News September 24, 2024
ఆహార కల్తీ కట్టడికి యూపీ సీఎం అదేశాలు
UPలోని అన్ని భోజన తయారీ హోటళ్లు, రెస్టారెంట్లలో చెఫ్లు, వెయిటర్లు తప్పక మాస్కులు, గ్లౌజులు ధరించాలని CM యోగి ఆదేశించారు. అలాగే CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిర్వాహకులు-యజమానుల పేర్లు ప్రదర్శించాలని అదేశించారు. ఆహార కల్తీ ఘటనల నేపథ్యంలో నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెంపునకు తాజా ఆదేశాలు ఇచ్చారు. ఆహార కల్తీని అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యమని యోగి పేర్కొన్నారు.
News September 24, 2024
అమృత్ టెండర్లతో రేవంత్కు సంబంధం లేదు: BRS మాజీ ఎమ్మెల్యే
TG: అమృత్ టెండర్లపై అనవసరంగా వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ‘సీఎం రేవంత్ రెడ్డికి టెండర్లకు ఎలాంటి లింక్ లేదు. నా అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్కు సొంత బావమరిది కాదు. సృజన్కు రాజకీయాలతో సంబంధం లేదు. కేటీఆర్కు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. త్వరలో ఆయన్ను కలిసి దీనిపై మాట్లాడతా. నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతా’ అని తెలిపారు.